కాతే కాంతా ధనగతచిన్తా
వాతుల కిం తవ నాస్తి నియంతా|
త్రిజగతి సజ్జనసంగతిరేకా
భవతి భవార్ణవతరణే నౌకా||
శ్లోకం అర్ధం : ఓయీ! నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా? నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము.
తాత్పర్యము : ఓయీ ! పరాత్పరుడైన భగవంతుడు లేడా? అతడు కరుణామయుడు. నారు వేసిన వాడు నీరు పోయడా? పుట్టించినవాడు పూట గడపడా! ఎందుకు నీకు చింత. అయ్యో! నేను లేకున్నా నా భార్యా-బిడ్డల గతి ఏమిటని చింతించకుము. దయా స్వరూపుడైన ఆ దేవుడు అందరికీ తిండి, గుడ్డ, నీడ తప్పక ఇచ్చును. కావున ఈ విషయముల మీద చింతించుట మాని, మనసు పరమాత్మపై లగ్నము చేయుము. సమయమును వృధా చేయక, సత్ సాంగత్యము చేగొని, వారి వలన ధర్మాధర్మములు, మంచి చెడ్డలు తెలుసుకొని, సన్మార్గమును గుర్తించి, భవ సాగరములో జీవిత నావను చక్కగా భగవత్ గమ్యమునకు తీసుకొని పొమ్ము.
No comments:
Post a Comment